Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

గ్రంధాలయలను ఆధునికరిస్తాం:జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు ఎన్. మధుబాల.

జానం,న్యూస్, పీలేరు, నవంబర్16:-ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శాఖా గ్రంథాలయాలకు రూ.30 కోట్లు బకాయీలు రావాల్సి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు ఎన్. మధుబాల తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల పర్యవేక్షణలో భాగంగా  ఆమె రాష్ట్ర గ్రంథాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం పీలేరు శాఖా గ్రంధాలయనిసందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 71 గ్రంథాలయాలకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయితీల నుంచి సెస్సు రూపంలో వసూలు చేసిన రూ.30 కోట్ల మేరకు అందాల్సి ఉందని అన్నారు.అందులో కనీసం 10కోట్ల మేర  బకాయిలు వచ్చిన గ్రంధాలయలను ఆధునికరిస్తామని తెలిపారు. ఈ బకాయిలన్నీ ఆయా పంచాయతీ ల ద్వారా రావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలోజిల్లా గ్రంధాలయ కార్యదర్శి శర్మ,పీలేరు గ్రంధాలయధికారి అమరనాధ్ తతితరులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

పీలేరు జడ్పీ బాలికోన్నత పాఠశాల చరిత్రలో అపూర్వ ఘనత…. పదవ తరగతి ఫలితాల్లో 92% ఉత్తీర్ణతతో పాఠశాల విశేష విజయాన్ని నమోదు చేసిన విద్యార్థినులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

విద్యుత్‌ పొదుపు.. భవితకు భరోసా!:APSPDCL, AE (పట్టణ) పురుషోత్తం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

జీవరాజ్ పాల్ వరప్రకాష్ ఔదార్యం – 23 మంది విద్యార్థుల చదువుకు వెలుగుదీపం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment