రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా REAL ఎస్. రామారావు ఎంపిక
చిత్తూరు జూలై 13(జానం న్యూస్):
చిత్తూరు కు చెందిన రూరల్ ఎడ్యుకేషన్ అండ్ లిబర్టీ (REAL ) సంస్థ వ్యవస్థాపక సభ్యులు మరియు కార్యదర్శి ఎస్. రామారావు ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీకి ప్రభుత్వేతర (నాన్-అఫీషియల్) సభ్యునిగా నియమించింది.
ఈ నియామకం 30-06-2026 తేదీతో జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.8 ప్రకారం రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ మూడు సంవత్సరాల పదవీకాలానికి అమల్లోకి వచ్చింది.
ఆహార భద్రత, ఆరోగ్యం, పోషకాహారం, వినియోగదారుల సంక్షేమం మరియు ప్రజా సేవల రంగాల్లో విశేషంగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులలో భాగంగా ఎస్. రామారావు కు ఈ అవకాశం లభించింది. గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల హక్కుల పరిరక్షణ, విద్యా ప్రోత్సాహం, సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలులో రియల్ (రియల్ ) సంస్థ చేస్తున్న విశేష సేవలకు ఇది గుర్తింపుగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎస్. రామారావు తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీ.డి.ఎస్)ను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు, వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు, ఆహార భద్రతా పథకాల సమర్థవంతమైన అమలుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా రియల్ (రియల్ ) సంస్థ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎస్. రామారావు ను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ కార్యకలాపాలకు ఆయన అనుభవం, నిబద్ధత విశేషంగా దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

