Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

శ్రీ సీతారామ కళ్యాణాన్ని రంగ రంగ వైభవంగా జరిపించిన సర్పంచ్ ఎస్.స్వాతి బాలకృష్ణ రాజు దంపతులు.

పులిచెర్ల, సెప్టెంబర్ 9(జానం న్యూస్):పులిచెర్ల మండలం 102 ఈ.రామిరెడ్డి గారి పల్లి గ్రామం, కొడిదపల్లె లో వెలసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం స్థానిక సర్పంచ్ ఎస్.స్వాతి బాలకృష్ణ రాజు దంపతులు రంగ రంగ వైబోగంగా కళ్యాణమును జరిపించారు, ఈ కళ్యాణాన్ని పులిచర్ల పురోహితులు, సాయిబాబా గుడి పురోహితులు,  జరిపించారు. శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించుటకు  భక్తులు తండోపతండాలుగా వచ్చారు.శ్రీ సీతారాముల ఊరేగింపు ఆనందోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఊరేగింపులో బాగంగా ప్రతి ఇంటి ముందు స్వామి వారు పూజలు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో పులిచెర్ల ఎంపిపి అయినటువంటి దేశిరెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, గంగిరెడ్డి అనేకమంది అధికారులు, అనధికారులు, గ్రామ ప్రజలు వచ్చి శ్రీ సీతారామ కళ్యాణాన్ని తిలకరించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

Socal Share

Related posts

జేఎన్‌టీయూ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి –JNTUA వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు బలిజ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా వర్ధంతి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పీలేరు నియోజకవర్గం అభివృద్ధి; ఏపీసీసీ మీడియా చైర్మన్ ఎన్.తులసి రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment