Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరులో ఉచిత కంటి వైద్య శిబిరం.. 30 మందికి పరీక్షలు, 15 మందికి శస్త్రచికిత్సల సిఫార్సు

పీలేరు పట్టణంలోని నెట్టి బండ కాలనీలో గుడ్ షెఫర్డ్ అనాధ పిల్లలు మరియు వృద్ధాశ్రమ సేవా సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. నిరుపేదలు, అనాధలు, వృద్ధులకు ఉచిత నేత్ర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానిక ప్రజలు విశేష స్పందన చూపారు.

పీలేరులో ఉచిత కంటి వైద్య శిబిరం.. 30 మందికి పరీక్షలు, 15 మందికి శస్త్రచికిత్సల సిఫార్సు

పీలేరు, జూన్ 23 (జానం న్యూస్): పీలేరు పట్టణంలోని నెట్టి బండ కాలనీలో గుడ్ షెఫర్డ్ అనాధ పిల్లలు మరియు వృద్ధాశ్రమ సేవా సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. నిరుపేదలు, అనాధలు, వృద్ధులకు ఉచిత నేత్ర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానిక ప్రజలు విశేష స్పందన చూపారు.

ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పేదలు, అనాధలు, వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇటువంటి కంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సేవా సంస్థలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

అనంతరం తిరుపతిలోని ఎస్.వి.ఆర్.ఆర్.జి.జి ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య విభాగం శాఖాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ పి.ఏ.ఎస్. చలపతి రెడ్డి మాట్లాడుతూ కంటి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే నేత్ర వైద్యులను సంప్రదిస్తే అనేక సమస్యలను నివారించవచ్చన్నారు. ప్రజలు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి చూపును సంరక్షించుకోవచ్చని వివరించారు.

ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో మొత్తం 30 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించి తదుపరి చికిత్సల కోసం సిఫార్సు చేశారు. శిబిరానికి హాజరైన రోగులకు అవసరమైన వైద్య సలహాలు, మందులు ఉచితంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ అనాధ పిల్లలు మరియు వృద్ధాశ్రమ సేవా సొసైటీ అధ్యక్షుడు ఈశ్వర్ బాబు, సభ్యులు చిన్న రెడ్డప్ప, వినయ్ కుమార్, తిరుపతి రుయా కంటి ఆసుపత్రి సిబ్బంది సుధాకర్, ఎం. సంతోష్ కుమార్, ఎం. జయప్రకాష్, జి. విజయ్ కుమార్, స్థానిక టీడీపీ నాయకులు పోలిశెట్టి సురేంద్ర (చాపల సూరి), వార్డు సభ్యుడు నాగేంద్ర, ఆటో రవి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

పాత బంధాలకు కొత్త ఊపిరి – వాల్మీకిపురం 1980 10th బ్యాచ్ మళ్ళీ కలుస్తోంది!

Dr. Gangi Reddy Janam Chief Editor-

జేఎన్‌టీయూ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి –JNTUA వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు

Dr. Gangi Reddy Janam Chief Editor-

కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా: ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment