Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు బలిజ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా వర్ధంతి.

జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 26; మంగళవారం స్థానిక కడప రోడ్డులో గల సంధ్య ప్రధమ చికిత్చాలయంలో స్థానిక బలిజ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి, టెంకాయ కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, పీలేరు మానవతా సంస్థ చైర్మన్, బలిజ సంఘం నాయకులు వంగిమల్ల రామచంద్ర,జనసేన పార్టీ నాయకులు కలప రవి, జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోకల తాతయ్య,న్యాయవాది చంద్రశేఖర్, రామిశెట్టి మనోహర్ మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా చనిపోయినా కూడా పేద ప్రజల గుండెల్లో జీవించి ఉన్నాడని అన్నారు. రంగా పేదల పాలిట పెన్నిధి, ఆశాజ్యోతి, యువతకు స్ఫూర్తి, బలిజలకు దశా నిర్దేశం చేసిన ప్రేరణకర్త. నవ సమాజ నిర్మాణానికి సమ సమాజ భవితవ్యాన్ని కి వారి యొక్క సేవలు , కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత సమాజం కోసం పాటుపడాలని అన్నారు.  రంగా  జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని బలిజలకు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలవడం, అటువంటి సేవా తత్పర్థ కలిగి సమాజం కు ఉపయోగపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం పీలేరు సభ్యులు లక్ష్మీకర్, శివ రాయల్,  మల్లికార్జున స్టూడియో గురుమూర్తి, , అండే సురేష్ బాబు, మెడికల్ షాప్ సుబ్బయ్య, హరీష్ , వీ.జే .జగన్మోహన్,  నవీన్, డాక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం అందుకున్న పీలేరు  లేబర్ ఆఫీసర్ కె.ఆర్ ఆనందబాబు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

తిరుపతిలో దేవాలయ స్వతంత్ర ప్రతిపత్తి కోసం భారీ జిల్లా సదస్సు – మార్చి 29న నిర్వహణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఉమ్మడి చిత్తూరు జిల్లా  అండర్-19 స్కూల్ గేమ్స్ బాలుర క్రికెట్ జట్టు ఎన్నిక.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment