Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా: ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్

ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇటీవల బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్ గారు మీడియాతో మాట్లాడుతూ – “ఈ పాఠశాలలో గతంలో 2009 నుండి 2017 వరకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు అదే పాఠశాలలో మళ్ళీ ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాఠశాల పరిసరాల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో మాకు సుస్థిర సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను ఉపయోగించి పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల మేలకు కృషి చేస్తాను” అని తెలియజేశారు.

కలికిరి , జూలై 26(జానం న్యూస్):

పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇటీవల బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్ గారు మీడియాతో మాట్లాడుతూ – “ఈ పాఠశాలలో గతంలో 2009 నుండి 2017 వరకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు అదే పాఠశాలలో మళ్ళీ ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాఠశాల పరిసరాల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో మాకు సుస్థిర సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను ఉపయోగించి పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల మేలకు కృషి చేస్తాను” అని తెలియజేశారు.

విద్యార్థుల అభ్యుదయంలో ప్రధాన లక్ష్యాలు

ఈ ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రులలో చాలా మంది నిరక్షరాస్యులు, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలవారు. గత సంవత్సరంలో పాఠశాల వార్షిక ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో బృందంగా – ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు, అధికారులు, శ్రేయోభిలాషుల కలిసికట్టుగా పనిచేసి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషిచేస్తామని స్పష్టం చేశారు.

సర్కారు సంక్షేమ పథకాల అమలు

గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వము విద్యాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా పథకం అమలు జరుగుతోందన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో అత్యుత్తమ నాణ్యత గల సన్నని బియ్యం వాడటం వల్ల విద్యార్థుల హాజరు పెరిగిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన యోగ డే, మాదకద్రవ్య నిషేధంపై ప్రత్యేక కార్యాచరణ

ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌లోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజయవంతంగా యోగ డే నిర్వహించామని తెలిపారు. విద్యార్థులలో మాదకద్రవ్యాల అవగాహన పెంచేందుకు సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు.

పొగాకు రహిత పాఠశాల, విద్యార్థుల సంఖ్య పెంపు పథకాలు

పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని పాఠశాల మరియు పరిసర ప్రాంతాలలో నిషేధించేందుకు ఓ ప్రత్యేక ప్రచారం చేశామని, ‘పొగాకు రహిత పాఠశాల’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

పేరెంట్స్-టీచర్స్ సమావేశం – పోటీలు, బహుమతులు

జూలై 10న జరిగిన మెగా పేరెంట్-టీచర్స్ మీట్‌లో తల్లిదండ్రులతోపాటు విద్యార్థులను ప్రోత్సహిస్తూ పలు పోటీలు నిర్వహించామని, విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు.

చివరగా: “పేద విద్యార్థుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వ పాఠశాలలు ముందుండాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తును సురక్షితంగా నిర్మించాలనీ, మా తరపున విద్యార్థుల విజయానికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్ తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

వైసీపీ ప్రభుత్వంలో పీలేరు మండలం అన్ని విధాలా అభివృద్ధి…

Dr. Gangi Reddy Janam Chief Editor-

వాయల్పాడు నుంచి గ్లోబల్ వేదికకు: క్రికెట్ విశ్లేషణలో శేషాద్రి సంపత్ అసాధారణ ప్రస్థానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన – 42 మందికి శస్త్రచికిత్సల ఎంపిక

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment