పీలేరు సెప్టెంబర్ 11(జానం న్యూస్): రాజంపేట ఎంపీ మరియు లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ప్రజల ఆరాధ్య దైవమని పంచాయతీ వార్డు సభ్యులు మరియు ఎంపి పిఆర్ఓ ఉదయ్ కుమార్ అన్నారు.
పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఉదయకుమార్ మాట్లాడుతూ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి సేవలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
అనంతరం కేకు కట్ చేసి అందరికీ పంచి పెట్టారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా టూరిజం కౌన్సిల్ సభ్యుడు షేక్ షాకీర్, సచివాలయం 2 కన్వీనర్ ఎం.సునీల్ రెడ్డి, మునీర్, షబ్బీర్, సదా, మలతోటి నరేష్, వైసిపి అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

