జానం న్యూస్, పిలేరు, నవంబర్ 23:పీలేరుకు చెందిన డాక్టర్ టి.యోగేష్ బాబు యూఏఈలో ఎడ్యుకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం అందుకున్నారు. గురువారం ఆయన పీలేరులో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ.అర్.యు, యుఎస్ఏ, ఈ.ఆర్.సి, ఇండియాలో పోస్టు డాక్టరల్ ఫెలోగా తన రీసెర్చిని కొనసాగిస్తున్నా అన్నారు. ఈ నెల 19, 20వ తేదీల్లో షార్జాలో జరిగిన యుఏఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో టి.యోగేష్ బాబు బెస్ట్ డైనమిక్ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ విభాగంలో “ఇండో మిడిల్ ఈస్ట్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు”ను అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో ఆయన గెస్ట్ స్పీకర్ గా ప్రసంగించడంమే కాకుండా “ఇంపాక్ట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ సిమోటిక్స్ ఆన్ ప్రొడక్ట్స్ ఇన్ ఏపి రీజియన్ ఇండియా” అనే రీసెర్చ్ ఆర్టికల్ ప్రజెంట్ చేసారు.ఎడ్యుకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం అందుకున్న సందర్భంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, పట్టణ ప్రముఖులు యోగేష్ బాబును అభినందించారు.


