Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో మహిళా దినోత్సవ క్రీడా వేడుకలు: పరుగుల పందేలు, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు 

చిత్తూరులో మహిళా దినోత్సవ క్రీడా వేడుకలు: పరుగుల పందేలు, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు 

  • జిల్లావ్యాప్తంగా పాల్గొన్న మహిళలు, ఆడపిల్లలు
  • అండర్–13, అండర్–18, సీనియర్ విభాగాల్లో పరుగుల పందేలు
  • టగ్ ఆఫ్ వార్ పోటీలకు మహిళల నుండి మంచి స్పందన
  • విజేతలకు బహుమతులు అందజేసిన అధికారులు

చిత్తూరు, మార్చి 8 (జానం న్యూస్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులో మహిళల క్రీడా ప్రతిభకు వేదికగా “అస్మిత లీగ్” క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. మై భారత్ చిత్తూరు మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆడపిల్లలు, మహిళలు పాల్గొని తమ ప్రతిభను చాటుతూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా అండర్–13, అండర్–18 మరియు సీనియర్ విభాగాలలో పరుగుల పందెం పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారిణులు ఉత్తమ ప్రదర్శన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అండర్–13 విభాగంలో జీ.లాస్య మొదటి స్థానం సాధించగా, రమ్య రెండో స్థానంలో నిలిచింది. హర్షితా మూడో స్థానం సాధించి ప్రతిభ కనబరిచింది.

అండర్–18 విభాగంలో ధనశ్రీ అద్భుత ప్రదర్శనతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. భారతి రెండో స్థానం, కామాక్షి మూడో స్థానం సాధించి తమ ప్రతిభను నిరూపించారు. సీనియర్ విభాగంలో కౌసల్య మొదటి స్థానాన్ని దక్కించుకోగా, నాగేశ్వరి రెండో స్థానం, శృతి మూడో స్థానం సాధించి అభినందనలు అందుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా టగ్ ఆఫ్ వార్ పోటీలు కూడా నిర్వహించారు. ఈ పోటీలకు మహిళల నుండి మంచి స్పందన లభించిందని జిల్లా యువజన అధికారి బి. ప్రదీప్ కుమార్ తెలిపారు. మహిళలు క్రీడలలో మరింత చురుకుగా పాల్గొనాలని, ఇలాంటి పోటీలు వారి ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ మహిళలు కూడా పురుషులతో సమానంగా క్రీడలలో రాణించే సామర్థ్యం కలిగి ఉన్నారని అన్నారు. క్రీడల ద్వారా దేశానికి పతకాలు సాధించి గౌరవం తీసుకురావాలని మహిళలను ఆయన ప్రోత్సహించారు. మహిళలకు క్రీడా రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గణాంకాధికారి ఎం.సి. బాబు రెడ్డి, ఫెన్సింగ్ కోచ్ కార్తీక్ రాఘవేంద్రతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు, కోచ్‌లు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఆసక్తిగా వీక్షించారు.

పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారిణులకు నిర్వాహకులు అభినందనలు తెలియజేసి బహుమతులు అందజేశారు. మహిళలలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Socal Share

Related posts

పీలేరు జడ్పీ బాలికోన్నత పాఠశాల చరిత్రలో అపూర్వ ఘనత…. పదవ తరగతి ఫలితాల్లో 92% ఉత్తీర్ణతతో పాఠశాల విశేష విజయాన్ని నమోదు చేసిన విద్యార్థినులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Free Coaching Offered for Polycet-24 at Government Polytechnic Mydukur.

Dr. Gangi Reddy Janam Chief Editor-

లంకను దాటించిన ప్రేమ

Jaanam News

Leave a Comment