కలికిరి పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి గృహప్రవేశానికి తరలి వచ్చిన రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు.
జానం న్యూస్, కలికిరి, నవంబర్ 19: ఆదివారం కలికిరిలో జరిగిన జనార్దన్ రెడ్డి గృహప్రవేశానికి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు తరలి వచ్చారు.జనార్దన్ రెడ్డి గృహప్రవేశం కార్యక్రమం కలికిరి పట్టణం, ఇందిరమ్మకాలనీలో అత్యంత వైభవంగా జరిగింది. సత్యనారాయణస్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
పై కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి సత్య నారాయణరెడ్డి, భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ చైర్ ఊమెన్ సుమతి రెడ్డి పాల్గొన్నారు.
రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి,పార్వతమ్మ దంపతులకు పులమాలలతో సత్కరించి, నూతన వస్త్రములు బహూకరించారు.
ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యులు కలకాలం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు.
పై కార్యక్రమంలో కలికిరి మాజీ ఎంపీపీ సహదేవ రెడ్డి సత్యనారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, తాతిరెడ్డి, శేషు కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, మధు, సుధాకర్ రెడ్డి, శివ, చిన్నారెడ్డి, చంద్రారెడ్డి, శివారెడ్డి, హరి కుమార్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, రాజారెడ్డి, జనార్ధన్ రెడ్డి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు,వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు.





